Green India Challenge
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ సురేష్ గారు మరియు వారి పోలీస్ బృందం. ఈ సందర్భంగా CI సురేష్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మూడు మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో 100 కు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షంచే బాధ్యత కూడా తీసుకున్నాము అన్నారు. ఇప్పుడు ఉన్న కాలుష్యానికి ఎంత మొక్కలు ఎక్కవ నాటితే అంత మంచిదన్నారు.సకాలంలో వర్షాలు సమృద్దిగా పడాలన్నా, సకల జీవ రాశులను మనం కాపాడు కోవాలాన్న మొక్కలు పెంచక తప్పదు అన్నారు.ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మాదాపూర్ Ci రవి, రాయదుర్గం Ci తిరుపతి, చందానగర్ Ci కాస్త్రో వీరి ముగ్గురిని కూడా మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.
25-Jan-2024 , 05:41 AM
24-Jan-2024 , 06:05 AM
Comments