26 September, 2022 |

Green India Challenge

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న పలు ఎన్‌జీవోలు

పర్యావరణ పరిరక్షణ, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ-ఉపాధి కల్పనకోసం... స్వచ్ఛంద సంస్థలు ఏకం కావాలని నిశ్చయించాయి. సమాజ సంక్షేమం కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఎన్‌జీవోలు ఒక తాటిపైకి వచ్చి పనిచేసినప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని వెల్లడించాయి.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ప్రాంగణంలో "నవ భారత నిర్మాణంలో ఎన్‌జీవోల పాత్ర" అంశంపై సదస్సు జరిగింది. జీఎంఆర్‌ ఫౌండేషన్‌, వాక్‌ ఫర్‌ వాటర్‌, కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవెల్యూషన్‌, వందేమాతరం ఫౌండేషన్‌, గ్రామ బజార్‌, సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌తోపాటు పలు పర్యావరణ, ఉపాధి శిక్షణ రంగాలకి చెందిన 60 ఎన్‌జీవో సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. పర్యావరణం, వ్యవసాయం, జలం, ఆరోగ్య రంగాల్లో ప్రభావవంతమైన మార్పుకోసం స్వచ్ఛంద సంస్థలన్నీ కలసి పనిచేయాలనే లక్ష్యంతో ప్రతి నెలలో చివరి శనివారం తామంతా ఒకచోట సమావేశమై తక్షణ, దీర్ఘకాల కార్యాచరణ ప్రణాళికలు, కార్యక్రమాలను నిర్ణయిస్తున్నట్లు ఆయా ఎన్‌జీవోల ప్రతినిధులు తెలిపారు. దేశంలో లక్షలాది ఎన్‌జీవోలు ఉన్నా... వాటన్నింటి మధ్య సమన్వయంలేక ఎవరికి వారే అన్నట్లుగా పనిచేస్తున్నందున... ఫలితాలు పెద్దగా ఉండడం లేదని పేర్కొన్నారు. ఎన్‌జీవోల వల్ల ఉపయోగంలేదనే దురభిప్రాయాన్ని తొలగించే విధంగా తామంతా ఒకే వేదికపైకి వచ్చి పరస్పర సహకారంతో సమష్ఠి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. సమావేశం అనంతరం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రతినిధులు... జీఎంఆర్‌ ప్రాంగణంలో... ఆయా ఎన్‌జీవోల ముఖ్య సభ్యులతో మొక్కలు నాటించారు.

WhatsApp Image 2022-09-24 at 16.11.43.jpeg

Share this blog

Comments


Popular Posts

Card image cap

Empower, Engage, Enact: Celebrating National Voters' Day in India!

25-Jan-2024 , 05:41 AM

Card image cap

Celebrating the Radiance of Girlhood: National Girl Child Day

24-Jan-2024 , 06:05 AM